నేత్రదానం పక్షోత్సవ కరపత్రాలను ఆవిష్కరిస్తున్న డాక్టర్ ఆదిత్య తదితరులు

నేత్రదాన ఉద్యమంలో పాల్గొనండి..దృష్టి సందేశ దాత అవ్వండి
 సిరా న్యూస్,పెదకూరపాడు;
నేత్రదాన ఉద్యమంలో పాల్గొనండి.. దృష్టి సందేశ దాత అవుతారని మరణాంతరం మీకళ్ళను దానం చేయవచ్చని 75 త్యాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వీర్నాల ఆదిత్య అన్నారు.పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని జన చైతన్య సమితి ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆస్పత్రిలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య మాట్లాడుతూ కొన్ని వేల మంది కంటి చూపు లేక చీకటిలో ఉండిపోతున్నారని వారందరికీ వెలుగులు ప్రసాదించాలంటే మరణానంతరం ప్రతి ఒక్కరు నేత్రదానం చేసి కంటి చూపు లేనివారికి ప్రసాదించాలని కోరారు.జన చైతన్య సమితి కార్యదర్శి తూల్లూరి సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. జన జనచైతన్య సమితి నిర్వాహకులు షేక్ లియాఖత్ ఆలీ మాట్లాడుతూ నేత్రదానం మనిషి మరణాంతరం మరో ఇద్దరికి చూపునిస్తుందని కేవలం కంటిలోని కార్నియా పురాణం మాత్రమే మరణాంతరం సేకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వేలితోటి అనిల్ కుమార్,ఆరోగ్య సిబ్బంది ధనలక్ష్మి, విజయ, చైతన్య, హఫీజియ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *