డా. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, సృతి వనం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి

పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష…

 సిరా న్యూస్,నంద్యాల;
మహానేత బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాణత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అవిష్కరణ, సృతివనం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని, వేలాదిగా ఈ మహోన్నత కార్యక్రమానికితరలిరావాలని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ… ఈనెల19వ తేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 20ఎకరాల సువిశాల ప్రాంగణంలో 404 కోట్ల వ్యయంతో 125 అడుగుల ఎత్తైన డా. బాబా సాహేబ్అంబేడ్కర్ విగ్రహాన్ని, అలాగే సృతి పనాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో వేలాదిగా విజయవాడకు తరలిరావాలని పిలుపునిచ్చారు. డా. అంబేద్కర్ ను సూర్తిగాఎస్సీ, ఎస్టీలకు మాత్రమే చెందిన వారుమాత్రమే కాదని, ఆయన అందరివాడని అన్నారు. మహానేత విగ్రహాన్ని ఈనెల 19వ తేదీ విగ్రహ ఆవిష్కరణ, సృతివనం, అందులో వివిధ బ్లాక్లు ప్రారంభించనున్నారని, ఈ
చారిత్రాత్మక కార్యక్రమానికి నంద్యాల నియోజకవర్గ ప్రజలు వెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్రెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీసెల్ కార్యదర్శి కారురవికుమార్, సంద్యాల పట్టణ అధ్యక్షులు పున్నాశేషయ్య, జాకీర్ హుస్సేన్ , మాజీ కౌన్సిలర్ అనీల అమృతరాజ్, వైఎస్సార్సీపీ నాయకులు దేశం సుధాకర్రెడ్డి, బీమనిపల్లి వెంకట సుబ్బయ్య,రామచంద్రుడు, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు శంకరానాయక్, వైఎస్సార్సీపీ రాయలసీమ జోన్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయిరాంరెడ్డి, బసవేశ్వరరెడ్డి, శివనాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *