సిరా న్యూస్,నాంపల్లి
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ దువ్వ నవీన్
వ్యాధులు ప్రబలకుండా ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ దువ్వ నవీన్ అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నమా నాయక్ తండా గ్రామంలో పారిశుధ్యంపై అవగాహన కల్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నివాస ప్రాంతాల చుట్టుపక్కల మురుగునీరు నిల్వకుండా, పిచ్చిమొక్కలు పెరగకుండా చూసుకోవాలని, కాచి వడగట్టిన గోరువెచ్చని నీటిని తాగడం, ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని గ్రామస్థులకు సూచించారు. నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అద్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ లు , గ్రామస్తులు పాల్గొన్నారు.