Dr K Bhimrao: మూడు కిలో మీట‌ర్ల న‌డిచి వైద్యం అందించిన డాక్టర్ కే భీంరావ్ బృందం

సిరాన్యూస్‌, బజార్ హత్నూర్
మూడు కిలో మీట‌ర్ల న‌డిచి వైద్యం అందించిన డాక్టర్ కే భీంరావ్ బృందం
* చిన్మ‌యి తండాలో వైద్య శిబిరం

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ కే భీంరావ్ ఆధ్వర్యంలో వర్షా కాలం సీజన్‌లో గిరిజన గ్రామాల ప్రజలకు వైద్యసహాయం చేయ‌డానికి రోజుకొక గ్రామం తిరుగుతూ వారికి వైద్యం చేరువ చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మండలం లోని గుట్టమీది గ్రామం అయిన చిన్మయి తండాగ్రామంకు 3 కిలోమీటర్లు కాలినడకన నడిచి వెళ్లి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా ఒక రోజు లోతట్టు గ్రామం ఒక రోజు గుట్టమీద ఉన్న గ్రామం, మరొక రోజు మైదాన ప్రాంతంలోని గ్రామములను సందర్శించి అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులను పరీక్షించి, చికిత్స అందిస్తున్నారు. రోగాలకు తగ్గట్టు మందులు, మాత్రలు, సూదులు, అందించి ఆరోగ్య జాగ్రత్తలు తెలియ జేస్తున్నారు.వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తగిన సూచనలు ఇచ్చారు. సోమ‌వారం వైద్య శిబిరo కేంద్రం అయిన చిన్మయి తండాకు వైద్య బృందం టెంబి గ్రామం నుంచి 3 కిలోమీటర్లు గుట్ట మీదికి నడిచి వెళ్లాల్సి వచ్చింది. టెంబి గ్రామం వరకు రోడ్డు మార్గం ఉన్నది. అక్కడి నుంచి మాత్రం వాహనాలు ఉన్న పోలేని పరిస్థితి. ఈ గ్రామం లో 50 మందికి సాధారణ చికిత్స చేయగా, 12 మంది జ్వర పీడితులకు రక్త నమూనాలు సేకరణ చేసి ల్యాబ్ కు పంపించినట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈవైద్య శిబిరంలో ఎచ్ ఈ ఓ సూర్య ప్రకాష్, ఎంఎల్ఎచ్పీ దివ్య రాణి, హెల్త్ అసిస్టెంట్ జి. రమేష్, ఏ ఎన్ ఎం విజయ, ఆశా కార్యకర్త పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *