సిరాన్యూస్, జైనథ్
ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలి: మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నైయత
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని జైనథ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నైయత సూచించారు. శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా మండలం ప్రజలకు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.జైనథ్ జిల్లా పరిషత్ హై స్కూల్లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. స్టూడెంట్స్ కి స్క్రీనింగ్ చేసి రక్త పరీక్షలు చేశారు. మెడిసిన్స్ కూడా ఇవ్వడం చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నిషియన్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.