Dr. Naveen Reddy: విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండాలి: డాక్టర్ నవీన్ రెడ్డి

సిరాన్యూస్‌, బోథ్‌
విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండాలి: డాక్టర్ నవీన్ రెడ్డి

విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల‌ని డాక్టర్ నవీన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లంలోని కేజీబీవీ పాఠశాల సాయినగర్ లో హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంత‌రం అవ‌స‌ర‌మైన మందుల‌ను అందించారు. ఈ సందర్బంగా డాక్టర్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతధికారుల ఆదేశాల మేరకు విద్యార్థుల ఆరోగ్యo రీత్యా ప్రతి శుక్రవారం బోథ్ మండల పరిధిలో గల హాస్టల్ లలో హెల్త్ క్యాంపు లు నిర్వహించడం జరుగుతుంద‌ని తెలిపారు. పిల్లలు ఆరోగ్యమీద శ్రద్ధ తీసుకొంటూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమం లో డాక్టర్ నవీన్ రెడ్డి, ఏఎన్ఎమ్ పావని ,హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్, ఆశావర్కర్లు , ప్రధానోపాధ్యాయులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *