Dr. Sandhyarani: ప్రజా సమస్యలపై అవగాహన కలిగింది:  జ‌డ్పీటీసీ డాక్టర్ సంధ్యారాణి

సిరాన్యూస్‌, బోథ్‌
ప్రజా సమస్యలపై అవగాహన కలిగింది:  జ‌డ్పీటీసీ డాక్టర్ సంధ్యారాణి
డాక్టర్ సంధ్యారాణిని స‌న్మానించిన క‌లెక్ట‌ర్ రిజ‌ర్షి షా

తాను రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదని, తన వృత్తి డాక్టర్ అయినా నా కుటుంబ సభ్యుల సహకారంతో రాజకీయాల్లోకి వచ్చి గెలుపొంది ఆ తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం లభించిందని జ‌డ్పీటీసీ డాక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం జడ్పిటిసిని ఆదిలాబాద్ లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజ‌ర్షి షా, మాజీ జెడ్పి చైర్మన్లు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్రింది స్థాయి ప్రజల ఇబ్బందులు వారు పడుతున్న కష్టాలు తమ దృష్టికి రావడం జరిగింది అన్నారు. పేద ప్రజలకు సరైన వైద్యం విద్య అందించాలని దృక్పథంతో పనిచేశానన్నారు బోత్ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడంతో పాటు 10 కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరి చేయించడంజరిగిందన్నారు. మొత్తం 27 కోట్ల 50 లక్షల రూపాయలు అప్పటి మంత్రి హరీష్ రావు కృషితో నిధులు తీసుకురావడం జరిగిందన్నారు.  అంతేగాక శిథిలావస్థకు చేరిన తాసిల్దార్ కార్యాలయం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అంతేగాక సిహెచ్సిలో గర్భిణుల‌కు స్కానింగ్ యంత్రం మంజూరికి 10 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగిందన్నారు. అప్పుడు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజు సహకారంతో పనిని పూర్తి చేశాను అన్నారు. కమ్యూనిటీ భవనం అంగన్వాడి, బోనాల నిర్వ‌హణ‌కు నిధులు మంజూరు చేసి తీసుకురావడం జరిగిందన్నారు ఎప్పటికీ తాను ప్రజా సమస్యలపైనే పోరాడతానని సమస్యలే అజెండాగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *