సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆరోగ్యంపై పట్ల శ్రద్ధ పెట్టాలి : డాక్టర్ సర్ఫరాజ్
* ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరాలు
విద్యార్థులు ఆరోగ్యంపై పట్ల శ్రద్ధ పెట్టాలని డాక్టర్.సర్ఫరాజ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా అంకొలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోనిమామిడిగుడా, వాన్వట్ ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక వైద్యశిభిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ సర్ఫరాజ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, డీఎంహెచ్ఓ ఆదేశాలతో ఈ క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజార్ లక్ష్మీ బాయి, ప్రేమసింగ్, ఇందుబాయ్, రుక్మిణి, సుమిత్ర, స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.