సిరాన్యూస్, ఆదిలాబాద్
దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు : డాక్టర్ సర్ఫరాజ్
* నిల్వ నీటిలో గంబూషియా చేప పిల్లలను విడుదల
దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అంకొలి ప్రాథమిక కేంద్రం డాక్టర్ సర్ఫరాజ్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ సబ్ సెంటర్ ఎరియాలోని పద్మావతి కాలనీ,శంకర్ గుట్ట కాలనీలో నిల్వ ఉన్న నీటిలో లార్వా లను గుర్తించి గుంతలలోని నీటిలో గంబూషియా చేప పిల్లలను అంకొలి ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో డాక్టర్ సర్ఫరాజ్ విడుదల చేశారు. ఈసందర్బంగా డాక్టర్ సర్ఫరాజ్ మాట్లాడుతూ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాధికారి డా. కృష్ణ ,జిల్లా మలేరియా అధికారి డా.శ్రీధర్ ఆదేశాలతో గంబూషియా చేప పిల్లలను విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ బొమ్మెత సుభాష్, నల్ల ఈశ్వర్ రెడ్డి, మలేరియా సిబ్బంది అనిల్, ఉదయ్, బాలాజీ, కార్తీక్ గౌడ్ కాలనీవాసులు పాల్గొన్నారు.