సిరాన్యూస్, ఆదిలాబాద్
డాక్టర్ శిరీష్కు వైద్య శిరోమణి అవార్డు
ప్రముఖ వైద్యుడు డాక్టర్ శిరీష్ వైద్య శిరోమణి అవార్డుకు ఎంపికయ్యారు. ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డే పురస్కరించుకొని పలు రంగాలో విశిష్టమైన సేవలు అందించిన వారిని ఎంపిక చేసి అవార్డును అందజేస్తారు. ఇందులో భాగంగానే వైద్య శాస్త్రం లో కొత్త కొనాల్ని ఆవిష్కరిస్తూ, పేద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించడంలో ముందు వరసలో ఉన్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ శిరీష్ను ఈఅవార్డు కింద ఎంపిక చేశారు. ఈ అవార్డును ఈ నెల 30 న హైదరాబాద్ మహానగరం లోని రవీంద్రభారతిలో మేఘాసీటీ నావకళా వేదిక , తెలంగాణ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి శ్యామ్ ప్రసాద్ (హైకోర్టు న్యాయమూర్తి ), సరస్వతి పుత్రులు శ్రీ దైవజ్ఞ శర్మ , నావకళా వేదిక అధ్యక్షులు మల్లికార్జున రావ్ , రాఘవ ,తహసీల్దార్ వర్ణ , న్యాయవాదులు సుధీర్ కుమార్ సంగెం, డీఎల్ పాండు పాల్గొని అవార్డు ప్రదానోత్సవం చెయ్యనున్నారు. ఈ పురష్కారం రావడం మరింత బాధ్యత పెంచిందని డాక్టర్ శిరీష్ పేర్కొన్నారు.