సిరాన్యూస్, జైనథ్:
వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలి
* మెడికల్ ఆఫీసర్ సుచల
* అయోడిన్ లోపం, వ్యాధి నియంత్రణ పై అవగాహన
వేసవి కాలం దృష్ట్యా వడ దెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మెడికల్ ఆఫీసర్ సుచల అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ జడ్పీ హెచ్ ఎస్ పాఠశాలలో గురువారం నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ కంట్రొల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈసందర్భంగా 90 మంది విద్యార్థులకు సాల్ట్ సర్వే చేయడం జరిగింది. సాల్ట్, మరియా యూరిన్ సాంపిల్స్ ల్యాబ్ కి పంపడం జరిగింది. అనంతరం మెడికల్ ఆఫీసర్ సుచల వడ దెబ్బ లక్షణాలు, ఎండాకాలం తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఓఆర్ఎస్ ఉపయోగాలు వివరించారు. కార్యక్రమంలో హెచ్ ఈ వో అనిత, ఏ ఎన్ ఎం నీల, రుక్మిణి , విద్యార్థులు పాల్గొన్నారు.