Dr. Varaprasad Rao : డిగ్రీ కాలేజీల యాజమాన్య రాష్ట్ర ఈసి సభ్యులుగా డా వరప్రసాద్ రావు

సిరా న్యూస్, బేల‌
డిగ్రీ కాలేజీల యాజమాన్య రాష్ట్ర ఈసి సభ్యులుగా డా వరప్రసాద్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కాలేజీ ల యాజమాన్య రాష్ట్ర ఈ. సి.సభ్యులు గా ఆదిలాబాద్ జిల్లా బేలా కీర్తన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు వేముగంటి ని ఎంపిక చేసినట్లు ఫౌండర్ చైర్మన్ శ్రీ సుందర రాజ్ యాదవ్ , కుప్మా చైర్మన్ శ్రీ ఉపేంద్ర రెడ్డి తెలిపారు. దాదాపు రెండు దశాబ్దాల గా విద్య రంగంలో అనుభవం ఉన్న వరప్రసాద్ రావు స్వ స్థలం కరీంనగర్ జిల్లా తాడికల్ గ్రామం .సుదీర్ఘ రాజకీయ అనుభవం నేపథ్యం నుండి రావడం ఉన్నత విద్యా వంతులు అయిన వరప్రసాద్ రావు రాష్ట్ర సభ్యులు గా మరింత సేవ లు అందించి సేవలు ఇవ్వాలని కీర్తన కాలేజ్ ఛైర్మన్ పవన్ కుమార్ అగర్వాల్ కోరారు .ఈ సందర్భంగా తన పై నమ్మకం ఉంచి ఇంత పదవి ఇచ్చిన సుందర రాజ్ యాదవ్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియమకం పట్ల అదిలాబాద్ యాజమాన్య తరపున హనుమాండ్లు , కార్తిక్ హర్షం ప్రకటన చేశారు. అలాగే కాలేజ్ సీనియర్ అధ్యాపకులు డా ప్రవీణ్, పుష్ప ఆమోల్, కిష్ట రెడ్డి , సాగర్ , బిందు తమ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *