డ్రైనేజికోసం రాస్తారోకో

 సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
డ్రైనేజీని తక్షణమే నిర్మించాలని ని డిమాండ్ చేస్తూ చండ్రుగొండ గ్రామస్తులు చండ్రుగొండ జూలూరుపాడు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకోటి చేపట్టారు.. వర్షం వస్తే డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీరంతా తమ ఇళ్ళలోకే చేరుతుందని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.. ఎట్టకేలకు ప్రభుత్వం నుండి సుమారు మూడు కోట్లకు పైగా నిధులు డ్రైనేజీ నిర్మాణం కోసం మంజూరయ్యాయని, మరి కొన్ని రోజుల్లో పనులు ప్రారంభించాల్సిన సమయంలో డ్రైనేజీ నిర్మాణం చేపడితే తమ ఇళ్ల కోల్పోవాల్సి వస్తుందని కొందరు వ్యక్తులు డ్రైనేజీ నిర్మాణ పనులను అడ్డుకోవడంతో డ్రైనేజీ నిర్మాణంలో జాప్యం చోటు చేస్తుందని, తమ స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు డ్రైనేజీ నిర్మాణ పనులు అడ్డుకుంటున్నారని దీనితో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక రాస్తారోకో చేపట్టామన్నారు. గ్రామంలోని అధిక సంఖ్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారని, తక్షణమే డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని వారి కోరారు.
విషయం తెలుసుకున్న చండ్రుగొండ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *