సిరాన్యూస్, చిగురుమామిడి
గాడిదల సంరక్షణ యూనిట్ ను సందర్శించిన డీఆర్డీఏ అధికారి ఆచార్య
చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్న గాడిదల సంరక్షణ యూనిట్ ను కరీంనగర్, సిద్దిపేట రెండు జిల్లాల జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు ఆచార్య,జయదేవ్ హర్యలు శుక్రవారం సందర్శించారు.నిర్వాహకులు వెంకటేష్,రామ్మోహన్ లను పెంపకం వాటి పోషణంపై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.లీటర్ పాలకు రూ.1000 నుండి 1500లు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహం అందితే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ సునిత, డిపిఎంలు ప్రవీణ్, విద్యాసాగర్, ఏపిఎం లు శ్రీనివాస్, సంపత్, సీసీలు బిక్షపతి, సత్యనారాయణ, వెంకటమల్లు, సంపత్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.