DRDA PD Sayanna:పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దివించాలి: డీఆర్‌డీఏ పీడీ సాయ‌న్న

సిరాన్యూస్‌, బేల‌
పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దివించాలి: డీఆర్‌డీఏ పీడీ సాయ‌న్న

పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దివించాల‌ని డీఆర్‌డీఏ పీడీ సాయ‌న్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం ర్యాలీ నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆదర్శ పాఠశాల చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయులు, ఐకేపీ సిబ్బందితో కలిసి మొదట సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ పీడీ సాయన్న మాట్లాడుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రతి గ్రామంలో ఊరు వాడల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాల చైర్మన్ తో పాటు, ఐకేపీ సిబ్బంది పాల్గొని గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న‌ట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు మంచి ప్రతిభవంతులు కల్గి ఉన్నారనీ అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించి పిల్లలను చదివించే బదులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోల నర్సింలు, ఆదర్శ పాఠశాల చైర్మన్, ఐకేపీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *