చిగురుమామిడి, సిరా న్యూస్
పారిశుధ్య పనులు చేపట్టాలని వేడుకోలు
దుర్గంధం వ్యాపిస్తున్న మురుగు నీటి కాలువలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని 12వ వార్డులో మురుగు నీటి కాలువ అస్తవ్యస్తంగా మారింది. పూడిక తీయకపోవడంతో దుర్వాసన వస్తోంది. ప్రభుత్వం పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నా ఇక్కడ మాత్రం మురుగు నీటి కాలువను పట్టించుకోవడం లేదు. ఫలితంగా దుర్వాసన వేధిస్తోంది. ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. చాలా సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామంలో మురుగు నీటి కాలువ వ్యవహారం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య కార్మికులు సైతం నిర్లక్ష్యంగానే ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దోమలు వ్యాపించి రాత్రంతా కునుకు లేకుండా చేస్తున్నాయి. విషజ్వరాల బారిన పడే అవకాశముందని మొత్తుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీటి కాలువలను శుభ్రం చేయించి మంచి వాతావరణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.