తాగునీరు అందక అవస్థలు.

సిరా న్యూస్;

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎక్కడ చూసినా తాగునీటి సమస్య …

పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని శ్రీరామ్నగర్, ఎర్రగడ్డ, నటరాజు నగర్, నేతాజీ నగర్ ప్రాంతాలలో తాగునీరు లేక పేద ప్రజల గొంతు ఎండుతోంది. సుమారు 40 రోజుల నుండి సమస్య ఎదురవుతున్నప్పటికీ వాటర్ వర్క్స్ అధికారులు మాత్రం తమ గూడును వినిపించుకోవడంలేదని ఎర్రగడ్డ లో ఉన్న వాటర్ వర్క్స్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ముట్టడించారు.
పేద ప్రజల గొంతు ఎండిపోతుంటే… నీళ్లు ఎక్కువ దొరకు విక్రయించుకుంటారా అని అధికారులను నిలదీశారు.
ఇదిలా ఉండగా పాలు ప్రాంతాలలో 24 గంటలు తాగునీరు వృధా అయ్యే కంటే తమక నీళ్ళు మళ్లిస్తే ఎంతో ఉపయోగకరమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమానికి దిగటం తప్పదని హెచ్చరించారు.
అయితే వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రీనివాసును స్థానిక ప్రజలు తమకు రెండు గంటల పాటు నీళ్లు ఇవ్వాలని కోరగా అది తన చేతిలో లేదని వాటర్ వర్క్స్ డీజిఎం అనుమతిస్తే తప్ప తాను తాగునీరు ఇవ్వలేనని ఖరాఖండగా చెప్పారు
=========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *