తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నం పార్లమెంట్ పరిథిలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. జలజీవన్ మిషన్ ద్వారా 365 రోజులు తాగునీరు అందించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన పెండింగ్ పనులపై సమీక్షించారు. రానున్న 50 సంవత్సరాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జలజీవన్ మిషన్ కింద నిధులు సమీకరిస్తామన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను కూడా మరింత వేగవంతం చేసేలా కృషి చేస్తామన్నారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ దిగువన 4 టీఎంసీ ల నీళ్లు నిల్వ చేసేలా మరో రెండు వంతెనల నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు ఎంపీ బాలశౌరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *