హుజురాబాద్ రోడ్డు రవాణా శాఖ అధికారి కంచి వేణు
సిరా న్యూస్,హుజురాబాద్;
రహదారులపై వాహన చోద కు లు మద్యం సేవించి వాహనాలను నడపరాదని హుజురాబాద్ రోడ్డు రవాణా శాఖ అధికారి కంచి వేణు హెచ్చరించారు. బుధవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ మద్యం సేవించి అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడిపే వాడు ఉగ్రవాది కన్న ప్రమాదకా రమని వివరించారు . తల్లి దండ్రులు తమ మైనర్ బాల బాలికలకు ద్విచక్ర, ఇతర వాహనాలు ఇవ్వరాడని చెప్పారు. పిల్లలపై మమకారం, ప్రేమ ఉంటే మంచి విద్య చేప్పించి ఆస్తులు కొనివ్వాలని వాహనాలను ఇచ్చి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఫోన్ మాట్లాడడం, పొగాకు ఉత్పత్తులని వాహనం నడుపాగా ఉపయోగించడం వద్దన్నా రు. ద్విచక్రవాహనము పై త్రి బుల్ డ్రైవింగ్ కు పాల్పడవద్దని, ప్రతి వాహన చోడకుడు లైసెన్స్ కలిగి ఉండాలని, అట్టి వాహనం భీమా చేయించాలని సూచన ఇచ్చారు. జాగ్రత్తగా వాహనాలు నడుపక పోవడం వల్ల అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని కంచి వేణు తన ఆనుభవాన్ని రంగరించి చెప్పారు. ఈ కార్యక్రమం లో ఖలీం, దేవేందర్ రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు.