ఉత్తరాఖండ్ లో డ్రగ్ కంట్రోల్ దాడులు

 సిరా న్యూస్,హైదరాబాద్;
ఉత్తరాఖండ్ లో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసారు. ఆపరేషన్ జై పేరుతో డ్రగ్స్ తయారీ కేoద్రం పై దాడులు నిర్వహించారు. యూపీ లోని కొట్ద్వార లో తయారీ కేంద్రం పై దాడి జరిపారు. తెలంగాణ తో పాటు పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. గత నెల 27న మలక్పేట్ లో ఓ కంపెనీ పై రైడ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు, అక్కడ లభించిన టాబ్లెట్స్ ఆధారంగా యూపీ కి వెళ్లారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. యూపీ కి చెందిన సచిన్ కుమార్ తో పాటు మరొకరిని ఆరెస్ట్ చేసారు. నెక్టార్ హెర్బులను రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *