సిరా న్యూస్, చిగురుమామిడి:
చిగురుమామిడి డీఎస్యూ కన్వీనర్గా మాతంగి అనిల్…
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ధర్మ స్టూడెంట్ యూనియన్ మండల కన్వీనర్గా మాతంగి అనిల్, కోకన్వీనర్గా కొంకట హరీష్లను నియమిస్తున్నట్లు డీఎస్యూ రాష్ట్ర కోకన్వీనర్ దాసరపు సదానందం తెలిపారు. ఈ మేరకు ఆదివారం వారికి నియామక పత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ నిరుపేద విద్యార్థుల సమస్యల పరిష్కారం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, రాజకీయ చైతన్యమే లక్ష్యంగా డీఎస్యూ పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాతంగి అనిల్, కోకన్వీనర్ కొంకట హరీష్లు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో మండల బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.