-మంథనిలో ఘనంగా శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
సిరా న్యూస్,మంథని;
నీతికి నిలువెత్తు నిదర్శనం ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని పలువురు కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. మంత్రి శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా గురువారం మంథనిలోని కూరగాయల మార్కెట్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో మంథని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు కాంగ్రెస్ నాయకులు రక్తదానం చేశారు. బస్టాండ్ ఆవరణలో ప్రచార కమిటీ కన్వీనర్ వొడ్నాల శ్రీనివాస్, గుడి అశోక్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆ తదుపరి ఎస్ సి సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం ఆధ్వర్యంలో మాతా శిశు ఆస్పత్రిలో కేక్ కట్ చేసి బాలింతలు, గర్భీణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ మచ్చ లేని విలక్షణ వ్యక్తిత్వం గల నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎంపిపి కొండ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి రమ-సురేష్ రెడ్డి, టిపిసిసి ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ శశిభూషణ్ కాచే, మున్సిపల్ అధ్యక్షుడు పోలు శివ, మున్సిపల్ యూత్ కాంగ్రెస్ పెంటరి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నూకల బాణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగారావు, బిసి సెల్ డివిజన్ అధ్యక్షుడు గొటికార్ కిషన్, ఐఎన్టీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరవేన లింగయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, డివిజన్ యూత్ ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజు, అజీంఖాన్,నాయకులు మంథని శ్రీనివాస్, మండల యూత్ ఉపాధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్, రేపాక శ్రీకాంత్, మున్సిపల్ యూత్ వర్కిం గ్ ప్రెసిడెంట్ సాదుల శ్రీకాంత్, ఎరుకల రమేష్ బాబు, మోహన్ సాయి, పర్శవేన మోహన్, ఊదరి శంకర్, సింగిల్ విండో డైరెక్టర్లు రావికంటి సతీష్ కుమార్, కొత్త శ్రీనివాస్, నాయకులు ఊట్ల అనిల్, అరెళ్లి కిరణ్ గౌడ్, ఇసంపల్లి రా జేశ్వర్, ఆకుల కిరణ్, కూర కోటేష్, మంథని సురేష్, వొడ్నాల ప్రవళిక, రాం రాజశేఖర్, ఎండి. జాఫర్, బూడిద రా జు, మాజీ సర్పంచులు రమేష్, రాయమల్లు, నాగుల రాజయ్య, దొరగొర్ల శ్రీనివాస్, ఉషన్ బీ, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.