సిరా న్యూస్,ఉట్నూర్
మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ సేవలు చిరస్మరణీయం: దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్
* స్నేహబంధాన్ని గుర్తు చేసుకుని నివాళి అర్పించిన దుర్గం శేఖర్
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుందని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ అన్నారు. ఉట్నూర్ లో గురువారం నిర్వహించిన రాథోడ్ రమేష్ పెద్దకర్మ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి , యాకుబ్ బేగ్, షాహెబ్ రావ్, రాజేశ్వర్, తిరుపతి, అజయ్ రాథోడ్, ఆత్మరాం. బానోత్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతం రమేష్ రాథోడ్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను స్మరించు కుంటూ నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జెడ్పి చైర్మన్ గా, ఎంపీ గా రమేష్ రాథోడ్ విశేష సేవలందించారని అన్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ నిరుపేదలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆయనతో ఉన్న స్నేహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ… రమేష్ రాథోడ్ మరణం తీరని లోటని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.