సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంనందిగామ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి రెండు బైక్ లపై వచ్చిన నలుగురు దొంగలు గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోకి చొరబడి హుండీని ఎత్తుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.