Dussa Bharti: జనసేన పార్టీని ఆశ్రయించిన బాధితులు దుస్స భారతి

సిరాన్యూస్‌, చిగురుమామిడి
జనసేన పార్టీని ఆశ్రయించిన బాధితులు దుస్స భారతి

చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన దుస్స భారతి వారి కుటుంబ సభ్యులు కలిసి శనివారం హుస్నాబాద్ లోని జనసేన పార్టీని ఆశ్రయించారు.న్యాయం చెయ్యాలని ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. భాదితురాలు మాట్లాడుతూ…మా గ్రామానికి చెందిన దుస్స గౌరీ శంకర్ తమ వ్యవసాయ పొలాన్ని దున్ననీయకుండా అడ్డుపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపారు. గ్రామంలో మాకు ఎవరు సహకరించవద్దని, ఒకవేళ సహకరిస్తే వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో పలుమార్లు పిర్యాదు ఇచ్చిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ నాయకుల అండ దండలతో పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. జనసేన పార్టీ వల్ల తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో వారిని ఆశ్రయించామని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ దుస్స భారతి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలుస్తామని వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *