సిరా న్యూస్,విజయవాడ;
ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవి, 4న గాయత్రీదేవి, 5న అన్నపూర్ణ దేవి, 6న లలితా త్రిపుర సుందరీదేవి, 7న మహాచండీ, 8న మహాలక్ష్మీ దేవి, 9న సరస్వతి దేవి, 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్దిని, 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.