Dutta Nikkam: కాప్రి రోడ్డు నిర్వహణకు నిధులు కేటాయింపు: బీజేపీ మండ‌ల అధ్య‌క్షులు దత్తా నిక్కం

సిరాన్యూస్‌,బేల‌
కాప్రి రోడ్డు నిర్వహణకు నిధులు కేటాయింపు: బీజేపీ మండ‌ల అధ్య‌క్షులు దత్తా నిక్కం
ఎమ్మెల్యే పాయల్ శంక‌ర్‌కు ధ‌న్య‌వాదాలు

ఆదిలాబాద్ జిల్లా బేల నుంచి కాప్రి మధ్య రోడ్డు నిర్వహణ, వెడల్పు కోసం 25 కోట్లు కేటాయించిన‌ట్లు బీజేపీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల‌ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్కు ధన్యవాదాలు తెలిపారు. మండలాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ ఠాక్రే,సర్పంచులు ఇంద్ర శేఖర్,వివేక్, బిజెపి నాయకులు గణేష్, నవీన్ పొత్ రాజ్ నవీన్, బర్కాడే రాము,సందీప్ ఠాక్రే, జీవన్,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *