Dyagala Saraiah: అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి…

సిరా న్యూస్, భీమదేవరపల్లి:

అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి…

-జెఏసి చైర్మన్ డ్యాగల సారయ్య

అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని జెఏసి చైర్మన్ డ్యాగల సారయ్య అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నేటి యువత అంబేద్కర్ సిద్ధాంతాలకు దూరం కాకుండా వారిని చైతన్య వంతులను చేయవలసిన అవసరం అంబేద్కర్ వాదులపై ఉందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ప్రతీ ఒక్కరూ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నారని అన్నారు. ఆ మహనీయుడు చూపిన బాటలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *