మేడ్చల్ జిల్లా వాసి రాధ హత్య
సిరా న్యూస్,మేడ్చల్;
నర్సింగ్ విద్యార్థిని పల్లెపాటి రాధను మావోయిస్టులు హతమార్చారు. రాధ అలియాస్ నీల్సో ఆరేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరింది. పోలీసులకు కోవర్టుగా మారిందని సమాచారంతో మావోయిస్టులు హతమార్చారు. ఈ మేరకు ఒక .లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కోంది. మూడు నెలల క్రితమే రాధ పై అనుమానం తో కమాండర్ బాధ్యతల నుంచి తొలగించారు. రాధ పార్టీ కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులకు వెల్లడించిందంటూ మావోయిస్టు పార్టీ పేర్కోంది