సిరా న్యూస్,సికింద్రాబాద్;
బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో లేదు. కేంద్రంలోకి వెళ్లి కొట్లాడితే రూపాయి వచ్చే పరిస్థితి లేదని మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. బోయిన్ పల్లిలో పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేయలేదు, కెసిఆర్ అహంకారం ఏంది, ఈ కుటుంబ పాలన ఏంది, చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదు అని ఆగ్రహించి కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని తెలిపారు. కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని నాలుగున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ చేయలేకపోయారు. గ్రామాల్లోకి వెళ్తే రానివ్వరన్న భయంతోనీ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న భూములమ్మి ఆ డబ్బులు తీసుకొని వచ్చి కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు ఇంతవరకు బ్యాంకులకు చేరలేదని వెల్లడించారు.. లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేయలేనప్పుడు, రేవంత్ రెడ్డి రెండు లక్షలు ఎలా మాఫీ చేస్తారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చుపెట్టగలగే శక్తి ఈ రాష్ట్ర ఖజానాలో లేదని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తప్పకుండా రెండు ఓట్లు బిజెపికి వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
==================