సిరా న్యూస్;
భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియకు మూలస్తంభమైన లోక్సభ ఎన్నికలు, కఠినమైన రాజకీయ ప్రచారానికి, శక్తివంతమైన ఎన్నికల డైనమిక్స్కు దృశ్యకావ్యం. రాజకీయ ప్రచారంలో నైతికతను, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం, భారత ఎన్నికల కమిషన్ ఎదుర్కుంటున్న అతి పెద్ద సవాళ్లు. డిజిటల్ ప్రభావం పెరిగేకొద్దీ, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుకోవడంలో, రాజకీయ ప్రయోజనాల కోసం డిజిటల్ ప్లాట్ఫారమ్ల దుర్వినియోగాన్ని అరికట్టడంలో ఎన్నికల సంఘం పాత్ర కీలకం. ప్రకటనల ఖర్చును పర్యవేక్షించడం, కంటెంట్ను ధృవీకరించడం, న్యాయమైన పారదర్శక ఎన్నికల వాతావరణాన్ని పెంపొందించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండేలా చూసుకోవడం కూడా ఇందులో భాగమే.2024 సార్వత్రిక ఎన్నికల కోసం దేశం సిద్ధమవుతున్న సమయంలో, సాంప్రదాయక ఆన్-ది-గ్రౌండ్ ప్రచారాలు ఇంకా డిజిటల్ వ్యూహాల ప్రభావం కొత్త ఎత్తులకు చేరుకుంది. పొలిటికల్ అడ్వర్టైజింగ్ అనేది అభ్యర్థులు ప్రజలకు చేరువ అవ్వాలని చేసే ప్రయత్నం. ముఖ్యంగా ఏమి చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనే విషయాలు ప్రజలకు తెలియజేయడం ఇందులో భాగమే!! ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయడానికి సాధారణంగా ప్రకటనలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా తమకే ఓటు వేయమని ఓటర్లను కోరుతూ ఉంటారు. తమకు అనుకూలమైన అంశాలను మాత్రమే కాకుండా.. ప్రత్యర్థి చేసే పనులపై వ్యతిరేకత తీసుకుని రావడానికి కూడా ప్రయత్నిస్తారు. గతంలో, రాజకీయ పార్టీ ప్రచార ప్రకటనలు న్యూస్ పేపర్ ప్రకటనలు, బిల్బోర్డ్లు, బ్రోచర్లు, రేడియో, టీవీ ప్రకటనలు, ఈ మెయిల్ల రూపంలో ఉండేవి. అయితే ఇటీవలి సంవత్సరాలలో సోషల్ మీడియాను రాజకీయ ప్రచారం కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆన్లైన్లో ప్రచారాలను నిర్వహించేందుకు బలమైన సోషల్ మీడియా బృందాలను తయారు చేసుకున్నాయి. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారులలో ఒకటి. మిలియన్ల మంది ఓటర్లతో కనెక్ట్ కావడానికి రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా, ఇంకా ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. ఎన్నికల ప్రచార వ్యూహాలలో, రాజకీయ కథనాలను రూపొందించడంలో, వాటిని వ్యాప్తి చేయడంలో, ఇంకా ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, ఆలోచనల-ఆదర్శాల యుద్ధభూమిగా మారుతోంది.జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో రాజకీయ ప్రకటనల డేటాను, మెటా యాడ్ లైబ్రరీ నుండి సేకరించాము. మా అధ్యయనం డేటాబేస్ జాబితాలోని మొదటి 10 పేజీలపై దృష్టి సారించి, BJP, కాంగ్రెస్, వైసీపీ అనుకూలంగా ప్రకటనలను ప్రదర్శించే అనధికారిక పేజీలను ఫిల్టర్ చేసి, ఎంగేజ్మెంట్ ఆధారంగా ఈ పేజీల నుండి పోస్ట్లను వేరు చేసి, ఒక మిలియన్ కంటే ఎక్కువ ఇంటరాక్షన్లు ఉన్నవాటిని శాంపిల్ చేసాము. మెటా యాడ్ లైబ్రరీ అనేది యాడ్ పారదర్శకత కోసం సమగ్రమైన, శోధించదగిన డేటాబేస్. ఖర్చుపై, రీచ్ పై ఇంకా ఫండింగ్ ఎంటిటీలతో సహా మెటా టెక్నాలజీలలో వారు చూసే ప్రకటనల గురించి వివరణాత్మక సమాచారాన్ని వినియోగదారులకు ఇది అందిస్తుంది. సామాజిక సమస్యలు, ఎన్నికలు లేదా రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల అదనపు సమాచారాన్ని కూడా అందిస్తుంది, ఈ ప్రకటనలు యాక్టివ్గా ఉన్నా లేదా నిష్క్రియంగా ఉన్నా వాటిని ఏడేళ్ల పాటు యాడ్ లైబ్రరీలో నిల్వ చేస్తుంది. టాప్ 100 పేజీలలో ఆంధ్రప్రదేశ్లోని పార్టీలకు సంబంధించిన టాప్ ప్రాక్సీ పేజీల జాబితాను, వారు ఖర్చు చేసిన మొత్తం ఇంకా వాటి ర్యాంకింగ్లను చూడండి టాప్ ప్రాక్సీ పేజీలలో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఇంకా భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పేజీలను మేము గమనించాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉన్న టాప్ 4 ప్రాక్సీ పేజీలను, అలాగే భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న ఒక ప్రాక్సీ పేజీని, ప్రకటనలు ఫేస్బుక్ పేజీలలోని పోస్ట్ల ద్వారా షేర్ అయిన కంటెంట్ను మేము సమగ్రంగా విశ్లేషించాము. YSRCPని రెండవ సారి అధికారంలోకి తీసుకురావడానికి I-PAC సీఎం జగన్తో చాలా సన్నిహితంగా పనిచేసింది. ఈ సమన్వయం అన్ని ప్లాట్ఫారమ్లలో ప్రణాళికాబద్ధమైన కంటెంట్ ప్రకటన, పంపిణీపై నియంత్రణ, ఒకే రకమైన కంటెంట్ ను ప్రమోట్ చేస్తున్న తెలివైన ప్రచార వ్యూహాన్ని స్పష్టం చేస్తుంది. నాయుడుని విమర్శించడానికి, జగన్ ఎజెండాను ప్రచారం చేయడానికి ఈ ప్రకటన సృజనాత్మక అంశాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుం ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ అనేది ఫిబ్రవరి 12, 2024న క్రియేట్ చేసిన మరో పేజీ. ఈ పేజీలో అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రకటనలే ఉన్నాయి. నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇస్తూ ప్రచారం చేసే ప్రకటనల కంటే ఎక్కువ. BRS పార్టీకి వ్యతిరేకమైన కంటెంట్తో కొన్ని ప్రకటనలు కూడా ఉన్నాయి. ఈ పేజీ వెబ్సైట్కి లింక్ చేశారు. ఈ వెబ్సైట్ ఏకైక లక్ష్యం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండడమే స్వతంత్ర సంస్థల నేతృత్వంలో, ఒక పారదర్శక భాగస్వామ్య ప్రక్రియ ద్వారా, ఆన్లైన్ ప్రకటనలకై నిర్దిష్ట నియామావళిని రూపొందించాలని పౌర సంఘాలు డిమాండ్ చేశాయి. మెటా ప్రతిస్పందన రాజకీయ పార్టీలు, వాటి ప్రాక్సీ పేజీలు మెటా యాడ్ సిస్టమ్ను ఎలా ఉపయోగించుకుంటాయో హైలైట్ చేస్తూ మేము మెటాని సంప్రదించాము, అలాగే ఈ సమస్యపై వారి స్పందనను కోరాము. మెటా ప్రతినిధి ఇమెయిల్ ద్వారా ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు, “మేము ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించబడిన ప్రకటనలపై చర్యలు తీసుకుంటాము. మా ప్రమాణాలను పాటించడంలో పదేపదే విఫలమైతే ప్రకటనదారుపై జరిమానాలు విధించే అధికారం కూడా మాకు ఉంది. ఎన్నికలు లేదా రాజకీయాల గురించి ప్రకటనలను ప్రదర్శించాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా అధికార ప్రక్రియ ద్వారా వెళ్లాలి. మా ప్లాట్ఫారమ్కు వర్తించే అన్ని చట్టాలకు ప్రకటనదారు లోబడి ఉండి, వాటిని ఉల్లఘిస్తే ప్రకటనదారే బాధ్యత వహించాలి.” ఇటీవలి భారత సార్వత్రిక ఎన్నికలలో, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు డిజిటల్ ప్రకటనలపై ఎక్కువగా దృష్టి సారించాయి, ప్రాక్సీ పేజీలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. మెటా ప్లాట్ఫారమ్లలో ప్రకటనలను అమలు చేయడానికి భారీ మొత్తం ఖర్చు చేయబడింది, ఇది డిజిటల్ ప్రచారానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అయితే, రాజకీయ ప్రకటనల ఖర్చు, కంటెంట్కు సంబంధించి పారదర్శకత ఇంకా జవాబుదారీతనం లేకపోవడం ఆందోళనలను రేకెత్తించింది. తరచుగా, సోషల్ మీడియాలో తప్పుడు సమాచార ప్రచారం ప్రబలంగా నడుస్తుంది, ఇది ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం.