ED Shankaraiah: ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి : ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకరయ్య

సిరా న్యూస్, బేల‌
ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి : ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకరయ్య
* భాది గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు

ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకరయ్య అన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా శుక్ర‌వారం ఆదిలాబాద్ జిల్లా బేల‌ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో భాది గ్రామంలో ఉచిత వైద్య శిబిరాని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈ డి శంకరయ్య హాజరయ్యారు.ఈ సందర్బంగా గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ వంశీ కృష్ణ ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేపట్టారు.దింతో పాటు గ్రామంలో ప్రధాన విధుల గుండా తిరుగుతూ పారిశుద్ధ్యం పైన మండల ప్రత్యేక అధికారి గ్రామస్థులకు అవగాహన కలిపించారు.కుండాలు, కూలర్లు ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండే నీటిని పారవేస్తూ గ్రామస్తులకు తొలగించాలని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశ వర్కలు మీ ఇళ్లలో వాడే కుండీలలోని నీటిని గురించి వివరించారా అని వారిని అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్బంగా మండల ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ఇళ్లలోని పరిశుభ్రతను ఆయన స్వయంగా పరిశీలిస్తూ రెండు రోజులకొకసారి నీటిని మార్చాలని, ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్‌ వంటి వస్తువులు ఇళ్ల పరిసరాల్లో ఉంచకుండా చూడాలని వారికి అన్నారు.గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలో ఉన్న మురికి కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని,కాలువలో నీరు నిల్వలు లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం తో పాటు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ వినోద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *