చిన వెంకన్న కళ్యాణ మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

సిరా న్యూస్,ఏలూరు;
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం విస్తృత ఏర్పాట్లు చేసారు. ద్వారక తిరుమల కొండ దిగువున స్వామివారి రూపములతో విద్యుత్ దీపాల అలంకరణ అందరిని ఆకట్టుకుంటోంది. నాలుగు గోపురములకు, అలివేటి మండపమునకు, స్వామివారి కొండపైన ఎంతో విద్యుత్తు లైటింగ్ తో స్వామి వారి కొండను అలినట్టుందా అనిపించేటట్లు ఏర్పాట్లు చేసారు. కొండ చుట్టూ విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరముగా అలంకరించారు. స్వామివారి క్రోధీనామ సంవత్సర బ్రహ్మోత్సవాలు 18 నుండి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 18వ తేదీన స్వామి వారిని అమ్మవారిని వరుడుగా వధువుగా అలంకరణ చేసారు. 22వ తేదీ స్వామివారి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం, 23వ తేదీ గ్రామంలో రథోత్సవం , 25వ తేదీ వసంతోత్సవం పుష్పయాగంతో ఉత్సవాల ముగింపు వుంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *