ముమ్మరంగా తనిఖీలు…
సిరా న్యూస్,అల్లూరి;
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఏజెన్సీ ముఖ ద్వారం పోక్స్ పేట గ్రామంలో ఎన్నికల దృశ్య పోలీస్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు రంపచోడవరం సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమలైనప్పుడు నుండి నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సందర్భంగా పోలీస్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామని తద్వారా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నగదు ట్రాన్స్పోర్ట్ అక్రమ మద్యం గిఫ్ట్లు వంటివి రవాణా చేయకుండా ప్రతి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని చెప్పారు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు వాహన తనిఖీలు ఉంటాయని ఎస్సై మోహన్ కుమార్ చెప్పారు…