Election Code :న‌లుగురి బీజేపీ నాయ‌కుల‌పై కేసు న‌మోదు

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
న‌లుగురి బీజేపీ నాయ‌కుల‌పై కేసు న‌మోదు

ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన న‌లుగురు బీజేపీ నాయ‌కులపై  కేసు నమోదు చేసిన‌ట్లు ఖానాపూర్ ఎస్సై జి లింబాద్రి తెలిపారు.నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బుధవారం గోషామహల్ ఎమ్మెల్యే రోడ్ షోకు పోలీసుల అనుమతి తీసుకున్నారు. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి రోడ్ షోకు స‌మ‌యాన్ని కేటాయించారు. 4 గంటల నుండి 6 గంటల వరకు అనుమ‌తి ఇచ్చారు. ఈసమయాన్ని మించి అనగా సమయం 7 గంటల 22 నిమిషాల వరకు ర్యాలీ నిర్వహించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన Aఏ) గొడం నగేష్ అదిలాబాద్ కాన్స్టెన్సీ బిజెపి పార్టీ క్యాండెడ్ , ఏ2) రాజాసింగ్, ఎమ్మెల్యే, గోషామహల్ అసెంబ్లీ. ఏ3) పాయల్ శంకర్ ఎమ్మెల్యే ఆదిలాబాద్ కాన్స్టెన్సీ. ఏ4) అంకం మహేందర్, ఖానాపూర్ మండలం బీజేపీ పార్టీ కాన్స్టెన్సీ కన్వీనర్మ, మ‌రికొందరి పైన హెచ్ ఓ పి-ఎలక్షన్ 2024, వీఎస్.టి-2 టీం, (వీడియో సర్వర్ లైసెన్స్ టీం), అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *