సిరాన్యూస్, కుందుర్పి
ఎన్నికల కమిషన్ నిబంధనలను విస్మరించిన స్టాఫ్ నర్స్
* పార్టీ ప్రచారంలో పాల్లొన్న స్టాఫ్ నర్స్ గంగమ్మ
ఓ స్టాఫ్ నర్స్ ఎన్నికల కమిషన్ నిబంధనలు విస్మరించిన ఈ ఘటన నియోజకవర్గ కేంద్రంలో జరిగింది. ఈమె నియోజకవర్గంలోని కుందుర్పి మండలం గ్రామ వాసి గంగమ్మ జిఎన్ఎం స్టాఫ్ నర్స్ పనిచేస్తున్నట్టు సమాచారం తెలిసింది. ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు చేపట్టిన అక్కడక్కడ ప్రభుత్వ ఉద్యోగులు మారడం లేదు అనడానికి ఈ ఘటనే చెప్పవచ్చు. కళ్యాణదుర్గంలో ప్రజలతో గంగమ్మ కలిసిపోయి ప్రభుత్వ ఉద్యోగాన్ని మరిచి రంగ యొక్క మెజార్టీతో గెలిపించాలని జింతా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయంగా మారింది. ఉద్యోగి వ్యవహరించిన తీరుపైఏ ప్రజలలోను ఉద్యోగులలోను విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త సహా సామాజిక మాధ్యమాలోను మీడియాలోను హల్ చల్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగి పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ, కాండువ వేసుకుని ప్రచారంలో పాల్గొన్న చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ మండల నాయకులు , అలియాస్ , శివ మూర్తి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వేటు వేస్తారా, నిమ్మకుండిపోతారా, కొమ్ము కాస్తారావేచి చూడాల్సిందే మరి.