పత్తికొండ ఆర్డీవో నీలపు రామలక్ష్మి
సిరా న్యూస్,పత్తికొండ;
పత్తికొండ పట్టణంలో జూనియర్ కళాశాలలోఆర్డీవో నీలపు రామలక్ష్మి ఆధ్వర్యంలోఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా సెక్టర్ ఆఫీసర్, సెక్టర్ పోలీసులు ఆఫీసర్లు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీవో నీలపు రామ లక్ష్మి మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం లో 142 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి , ప్రతి మండలంలో గ్రామాల్లో ,ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పై ప్రజలకుఅవగాహన సదస్సు చేసి,పోలింగ్ కేంద్రాలలో ఖచ్చితంగా ర్యాంపు, పోలింగ్ జరిగే గదిలో లైటింగ్, ఎలక్ట్రిఫికేషన్ వైరింగ్, టాయ్లెట్ విత్ రన్నింగ్ వాటర్ ఉండే విధంగా చూసుకోవాలన్నారు.. ప్రతి పోలింగ్ కేంద్రంలో సిసి కెమెరా విత్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకోసం ప్లగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ ఏర్పాట్లు ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది ముఖ్యంగా మహిళ ఉద్యోగులు కూడా పోలింగ్ ముందు రోజు అక్కడే నిద్రచేసి, పోలింగ్ రోజుకి సిద్ధం అవ్వాల్సి ఉంటుందని, 1,2 లేదా 3 పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట కనీసం 2 టాయిలెట్స్, 4,5 పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట ఇంకా అదనంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మౌలిక వసతులు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి 3 ఫోటోలు పంపాలని ఆర్డిఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మండలాల తాసిల్దారులు, పోలీసులు అధికారులు పాల్గొన్నారు