Electoral Bonds: ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ ముసుగులో క్విడ్ ప్రో కో…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ ముసుగులో క్విడ్ ప్రో కో…

– డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి

– బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎల‌క్టోర‌ల్ బాండ్ల ముసుగులో క్విడ్ ప్రో కో కు పాల్పడుతుందని ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి విమర్శించారు. గురువారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుప్రీం కోర్ట్ ఎల‌క్టోర‌ల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించినప్పటికీ కూడా బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు పేర్లను ప్రకటించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. వెంటనే ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిసిసిబి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలో ఎల‌క్టోర‌ల్ బాండ్ల ద్వారా వివిధ పార్టీలకు అందిన విరాళాల్లో అత్యధిక శాతం బిజెపి పార్టీకి అందాయని అన్నారు. 55% విరాళాలు ఒక్క బీజేపీ పార్టీకే ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో అవినీతికి పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బిజెపికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆదిలాబాద్ లో సైతం కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్, యాల్ల పోతా రెడ్డి, బాయిన్ వార్ గంగా రెడ్డి,bఎం.ఏ షకీల్, మొహమ్మద్ రఫీక్, నిమ్మల ప్రభాకర్, బూర్ల శంకరయ్య, కొండూరి రవి, మానే శంకర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *