సిరాన్యూస్,బోథ్
పొంచి ఉన్న ప్రమాదం.. పట్టించుకోని అధికారులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట (బి) గ్రామంలో ముదిరాజ్ కాలనీలో కుడికాలువ సమీపంలో విద్యుత్ స్తంభం విరిగిపోయేలా ఉంది. స్తంభం అడుగుభాగం పూర్తిగా తప్పు పట్టడంతో విరిగిపోయేలా ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. గతంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన స్పందించడం లేదని వాపోతున్నారు. ప్రమాదం జరుగుతే గాని పట్టించుకోరని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.