Electric wires: కుమారిలో ప్ర‌మాద‌క‌రంగా విద్యుత్ తీగ‌లు

సిరా న్యూస్, నేరడిగొండ
కుమారిలో ప్ర‌మాద‌క‌రంగా విద్యుత్ తీగ‌లు
* భ‌యాందోళ‌న‌లో కాల‌నీవాసులు
* ప‌ట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామంలోని క్రైస్తవ ప్రార్థన మందిరం పై విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. దీంతో ప్రార్థన మందిరంకు వచ్చే వారు విద్యుత్‌ తీగలతో భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం పొంచి ఉందని విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసిన పట్టించుకునే దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్‌ తీగలను సరి చేసి తమ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *