సిరా న్యూస్,పెనమలూరు;
ఉయ్యురు, కాటూరు రోడ్డులోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో రోడ్డుపై కరెంట్ తీగలు పడిపోయాయి. ఆ తీగెలలో విద్యుత్ ప్రవహిస్తోందో లేదో తెలియనప్పటికీ, ఉదయం వరకు విద్యుత్ త్ శాఖధికారులు మాత్రం పట్టించుకోలేదు. సమీపంలో నే స్కూల్స్, కాలేజీ లు ఉండటం తో అటుగుండా వెళ్ళే విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రోడ్డుపై పడివున్న విధ్యుత్ తీగేలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఉదయం పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు, తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురవుతున్నారు.