సిరా న్యూస్, బోథ్
రోడ్డుకు అడ్డంగా విద్యుత్ తీగలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం సమీపంలోని ఆదిలాబాద్ -నిర్మల్ రహదారిపై కోరమండల్ కార్యాలయానికి సమీపంలో రోడ్డుకు అడ్డంగా విద్యుత్ తీగలు ఉండడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అయితే సోమవారం పాత ఇనుప సామాగ్రితో వెళుతున్న ఐచర్ పైన ఉన్న సామాగ్రి వాహనానికి తగలడంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యాపార సముదాయంలో ఉన్న కంప్యూటర్ చెడిపోయింది. దీంతో వ్యాపారికి రూ.15 వేల నష్టం వాటిల్లిందని యజమాని పేర్కొన్నారు.