– భయభ్రాంతులకు గురవుతున్న విఎల్ఎన్ పురం గ్రామ ప్రజలు
సిరా న్యూస్,పరవాడ;
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పి బోనంగి పంచాయితీ శివారు విఎల్ఎన్ పురం గ్రామంలో బోయమాంబ ఆలయం సమీపంలో అంగన్వాడి స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ శిధిలావస్థలో ఉండి అటుగా వెళ్లే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఏ క్షణం ఎలా ఉంటుందో అని అంగన్వాడి స్కూల్ కి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకెళ్లడం మానేశారు.గతంలో ఇదే విషయంపై పలు పత్రికలో వార్తలు వెలువడిన అధికారులు నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇటీవలే గ్రామ ప్రజలందరూ చందాలు వేసుకొని ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు పది అడుగుల సిమెంట్ దిమ్మ కట్టించారు. దీనిపై స్పందించిన ఏ ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పక్కకు మార్చేందుకు సిద్ధమయ్యారు కానీ ఏమి అయ్యిందో ఏమో కానీ మూడు నెలల నుంచి ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు మొగ్గు చూపడం లేదు. విద్యుత్ అధికారులకు తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని ఇది ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో అంగన్వాడీలో ఉండే పిల్లలకి,అటుగా వెళ్లే ప్రజలకు తీవ్రమయిన పరిణామాలు చోటుచేసుకొంటాయి అని దీనిపై విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరూతున్నారు.