ఏనుగుల బీభత్సం

సిరా న్యూస్,మన్యం;
కొమరాడ మండలం గంగిరేగువలస గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాల్లో ఏనుగులు సంచరించడంతో సుమారు 20 ఎకరాల టమాట పంటను నాశనం చేశాయి. అరటి, జొన్న వంటి పంటలను ఏనుగులు నాశనం చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో పెట్టిన నష్టపరిహారం కూడా ఇప్పటివరకు రాలేదంటూ రైతులు తెలిపారు. ఇప్పుడైనా పోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *