Eleti Ashwin Reddy: కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలి

సిరాన్యూస్‌, బోథ్‌
కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలి
జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏలేటి అశ్విన్ రెడ్డి
* గాంధీ భవన్‌లో బోథ్ నాయకులతో చ‌ర్చ‌

రాబోయే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యం గ అందరూ నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏలేటి అశ్విన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో శ‌నివారం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా బోథ్ నాయకులతో ఏలేటి అశ్విన్ రెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ ఆడబిడ్డ ఆత్రం సుగుణక్క ను భారీ మెజారిటీ తో గెలిపించుకునే బాధ్యత మన భుజస్కందాల మీద ఉందని తెలిపారు. నేను కూడా మీతో పాటే మీ వెన్నంటే ఉండి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తానని అశ్విన్ రెడ్డి తెలియచేశారు. కార్యక్రమం లో బోథ్ ఎంపీటీసీ కుర్మే మహేందర్, మెరుగు భోజన్న, బారే నాగేందర్, నిగిని మాజీ ఉపసర్పంచ్ సాయన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *