సిరా న్యూస్, భీమదేవరపల్లి
త్వరలో గ్రామ కమిటీల నిర్మాణం
* అంబేద్కర్ సంఘం మండల కన్వీనర్ ఎల్తూరి ప్రేమ్ రాజ్
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో అంబేద్కర్ సంఘం గ్రామ కమిటీల నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు అంబేద్కర్ సంఘం మండల కన్వీనర్ ఎల్తూరి ప్రేమ్ రాజ్ తెలిపారు. మండలంలోని ముల్కనూర్ నూతన అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ సంఘం నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల అంబేద్కర్ సంఘం తాత్కాలిక కమిటీని నియమించారు. అంబేద్కర్ సంఘం మండల కన్వీనర్ గా ముల్కనూర్ గ్రామానికి చెందిన ఎల్తూరి ప్రేమ్ రాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ మండలంలో తాత్కాలిక కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. త్వరలో మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి గ్రామ కమిటీల నిర్మాణం చేస్తామన్నారు. గ్రామ కమిటీల నిర్మాణం అనంతరం పూర్తిస్థాయి మండల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.