దస్తురాబాద్, సిరా న్యూస్
ఉద్యోగుల సేవలు ప్రజలకు మేలు చేస్తాయని అంటున్నారు. జిల్లా దస్తురాబాద్ మండలంలోని వ్యవసాయ కార్యాలయంలో విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జాడి తిరుపతికి గణతంత్ర దినోత్సవ సమయంలో ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసలుపొందాడు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, జడ్పీచైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేతుల మదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అతడిని ప్రశంసించారు. మండలవాసులు కూడా అభినందించారు.