ఉపాధి హామీ కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలి

: కొయ్యడ సృజన్ కుమార్

సిరా న్యూస్,రామడుగు;
ఉపాధి హామీ కూలీల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బి కే యం యు రాష్ట్ర కార్యదర్శి కొయ్యాడ సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంలో ఉపాధి హామీపనులను సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు గత నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారని శ్రమకు తగిన ఫలితం లేకుండా పోతుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కొలతల ఆధారంగా పని చూడకుండా కూలీల వేతనాలు పెంచాలని అన్నారు. ఆధార్ లింకుతోపనిచేసిన డబ్బుల మెసేజ్ వస్తున్న ఖాతాలో డబ్బులు పడడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టం ప్రకారం ఉపాధి హామీ కూలీలకు రోజువారికూలి 600 రూపాయలు చెల్లించాలని 200 రోజులు పని కల్పించాలని పని ప్రదేశాలు దూరంగా ఉంటే రవాణా ఖర్చులు ఇవ్వాలని ఉపాధి కూలీలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని 50 సంవత్సరాలు నిండిన వారికి5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని పని గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని సృజన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంటె రాజేశం కనుకయ్య ఎగుర్ల మల్లేశం ఐలయ్య రాజవ్వ విజయలక్ష్మీ లలిత జ్యోతి మాధవి వనిత శైలజ రాజవ్వ కనక లక్ష్మి మల్లవ్వ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *