డ్రగ్స్ మహమారిని తరిమేద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం
సిరా న్యూస్,సిద్దిపేట;
మత్తు చేస్తుంది జీవితాన్ని చిత్తు మారకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించి విద్యార్థిని విద్యార్థులచే మరియు కార్యాలయ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఉపన్యాసము, పెయింటింగ్, గెలుపొందిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్, సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది తదనంతరం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కళాశాల పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు. గ్రామాలలో పట్టణాలలో యువతి యువకులు మంచి అలవాట్లతో తల్లిదండ్రులు మరియు గురువుల చెప్పిన మాటలు విని చదువుతూ ముందుకు వెళితే చక్కని భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మారకద్రవ్యాల విషయములో ఎంత పెద్ద వారు ఉన్న ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మారకద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు.
జూన్ 26 న మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు పట్టణాలు, మండలాలలోని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు విస్తృత స్ధాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ..
మేము మారకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి, నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియపరుస్తానని, డ్రగ్ రహిత సమాజం లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినౌతానని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
పోలీస్ కళాబృందం, మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి బృందం డ్రగ్స్ గురించి దాని వినియోగం వల్ల జరిగే నష్టాల గురించి పాటల ద్వారా, విద్యార్థిని విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎస్ మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసిపి మధు, ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ మూర్తి, డిడబ్ల్యుఓ శారద, ఇన్స్పెక్టర్లు లక్ష్మీబాబు, విద్యాసాగర్, ఉపేందర్, రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ గురుస్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, రాజేష్, పూర్ణ చందర్, ప్రసాద్,కమిషనర్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలల స్కూళ్ల యాజమాన్యం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
==============