సిరా న్యూస్, కందుర్పి:
కర్ణాటక మద్యం, ఒక బైక్ సీజ్
అనంతపురం జిల్లా ఎరిడికెర చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం, ఒక బైక్ను బ్రహ్మ సముద్రం పోలీసులు సీజ్ చేసారు. వివరాల్లోకి వెళితే… ఎరిడికెర చెక్పోస్ట్ వద్ద వహానాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఒక బైక్ను ఆపి చూడగా అందులో 288 కర్ణాటక మద్యం ప్యాకెట్ల లభించాయి. ఎరిడికెరకు చెందిన వీరదాసు, మళ్లేసీలు కర్ణాటక రాష్ట్ర శిరివాళం గ్రామంలోని సూపర్ బార్ అండ్ రెస్టారెంట్ నుండి 288 మద్యం ప్యాకెట్లు కొనుగోలు చేసి, బైక్పై తిరిగి వస్తున్నారు. చెక్పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులకు మద్యం లభించడంతో మద్యంతో సహా బైక్ను సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేసారు. కాగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు అక్రమ మద్యం రవాణాను అడ్డుకట్ట వేసేందుకు పక్కగా దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.